ప్రజాశక్తి-విజయనగరంకోట : జిల్లా పోలీసుశాఖలో కమ్యూనికేషను ఇన్స్పెక్టరుగా పని చేసి, ఉద్యోగ విరమణ చేసిన పి.వి.రమణమూర్తికి జిల్లా ఎస్పి వకుల్ జిందల్ అతి ఉత్కృష్ట సేవా పతకాన్ని గురువారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ – పోలీసుశాఖకు సుదీర్ఘంగా క్రమశిక్షణతో సంతృప్తి కరంగా విధులు నిర్వహించి, నిస్వార్థంగా సేవలందించే పోలీసు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అతి ఉత్కృష్ట సేవాపతకం అందిస్తుందన్నారు. కమ్యూనికేషను విభాగంలో ఇన్స్పెక్టర్గా పనిచేసిన రమణమూర్తి పోలీసుశాఖకు ఎంతో క్రమ శిక్షణతో 38సం.లు నిస్వార్థంగా సేవలందించారన్నారు. ఆయన సేవలను గుర్తించిన అప్పటి జిల్లా పోలీసు అధికారులు ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలకు గతంలోనే ఈ సేవా పతకంను ప్రకటించారని తెలిపారు. పతకం జిల్లా కేంద్రంకు రావడంతో ఉద్యోగ విరమణ అనంతరం పి.వి.రమణమూర్తికి అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కమ్యూనికేషను ఇన్స్పెక్టరు శ్రీకాంత్ యాదవ్, పివి రమణ మూర్తి, కుమార్తె పి.కిరణ్మయి పాల్గొన్నారు.
హోంగార్డు కుటుంబానికి చేయూత
జిల్లా పోలీసుశాఖలో హోంగార్డుగా పని చేసి, ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన బి.సుందరరావుకు ‘చేయూత”ను అందించేందుకు హోంగార్గులు ఒక్క రోజు డ్యూటీ అలవెన్సు రూ.3,25,180 చెక్కును ఎస్పి వకుల్ జిందాల్ గురువారం అందజేశారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వలన పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెరగడంతోపాటు, వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా లభిస్తుందని ఎస్పి తెలిపారు. కార్యక్రమంలో హోంగార్డ్సు కమాండెంట్ టి. ఆనందబాబు, ఆర్ ఆర్.రమేష్ కుమార్, సూపరింటెండెంట్ టీ.రామకృష్ణ, పోలీసు కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.