డివైఎఫ్ఐ ప్రకాశం జిల్లా అధ్యక్షులు కే వి పిచ్చయ్య…….
ప్రకాశం : డీఎస్సీలో ప్రకాశం జిల్లాలో ఎస్జిటి పోస్టుల సంఖ్యను పెంచి ఒకే జిల్లాకు ఒకే పేపర్ ని ఏర్పాటు చేయాలని డివైఎఫ్ఐ ప్రకాశం జిల్లా అధ్యక్షులు కేవీ పిచ్చయ్య అన్నారు.ఈ సందర్భంగా గురువారం కనిగిరి సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిలబస్ ఎక్కువగా ఉన్నందున డీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థులకి కనీసం 90 రోజులు గడువుని పెంచాలన్నారు. 2023.2024 పూర్తి చేసిన అభ్యర్థులు దాదాపు రెండు లక్షల మంది ఉన్నారని వారికి టెట్ అవకాశం కల్పించాలన్నారు. డీఎస్సీ పరీక్ష నార్మలైజేషన్ కాకుండా ఉండాలని అన్నారు. నార్మలైజేషన్ వలన మెరిట్ విద్యార్థులు నష్టపోతున్నారని, ఒకే జిల్లా కి ఒక పేపర్ ని నిర్వహించాలని అన్నారు. ఓపెన్గా చదివిన విద్యార్థులకి అవకాశం కల్పించాలని, డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ వారికి స్కూల్ అసిస్టెంట్ లో అవకాశం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ కనిగిరి మండల కార్యదర్శి పి నరేంద్ర. నాయకులు రవి, సాయి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో ఎస్జీటీ పోస్టుల సంఖ్యను పెంచాలి : డివైఎఫ్ఐ
