ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధి ద్వారా అందించే ఉచిత కుట్టు శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కోరారు. వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన స్థానిక వైటిసిలో కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఎప్పుడు అండగా ఉంటుందని, ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం కల్పిస్తున్న ఇటువంటి శిక్షణలను మహిళలు సద్వినియోగం చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తమ కుటుంబాలను చక్కదిద్దుకోవచ్చని అన్నారు. శిక్షణలో రాణించి పలువురు మహిళలకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్ పర్సన్ కడ్రక కళావతి, మండల టిడిపి అధ్యక్షులు పాడి సుదర్శన్ రావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు, ఎంపిడిఒ సాల్మన్రాజ్, నాయకులు నందివాడ కృష్ణబాబు, వెంపటాపు భారతి, తాడంగి రామారావు, అడ్డాకుల నరేష్, నిమ్మక సింహాచలం, అప్పలస్వామి, రాజేష్, చిన్న, సుబ్బలక్ష్మి, శిక్షణ కేంద్ర నిర్వాహకులు రాజేష్, వైటిసి, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
