సైనికులకు సంఘీభావం

May 9,2025 23:37
lawyers

ప్రజాశక్తి-యంత్రాంగం లీగల్‌ : ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) విశాఖపట్నం యూనిట్‌ ఆధ్వర్యాన భారత సైనికులకు సంఘీభావ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కోర్టు ప్రధాన ద్వారం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులు చేస్తున్న నరమేధాన్ని, దానికి సహాయం చేస్తున్న పాకిస్థాన్‌ కార్యక్రమాలను ముక్తకంఠంతో ఖండించారు. పౌర రక్షణలో సైనికుల నిరంతర కృషికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ విశాఖపట్నం యూనిట్‌ ప్రెసిడెంట్‌ సురేష్‌కుమార్‌, జనరల్‌ సెక్రటరీ ఎన్‌.వెంకటేశ్వరరావు, గౌరవాధ్యక్షులు బివి.రామాంజనేయరావు, ఉపాధ్యక్షులు చాట్ల ఆనందరెడ్డి తదితరులు మెంబర్లు పాల్గొన్నారు.

సీతమ్మధార : దేశ భద్రతలో ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్‌ త్యాగాన్ని భారత దేశ ప్రజానీకం ఎన్నటికి మరవదని వైసిపి జిల్లా అధ్యక్షులు కెకె.రాజు పేర్కొన్నారు. మురళీనాయక్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

➡️