ప్రజాశక్తి – విశాఖ : స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలవుతున్న కొండ శిఖరం గ్రామంలో జీవనం సాగిస్తున్నటువంటి కొందు ఆదివాసి గిరిజనులకు పీఎం జమ్మన్న పథకంలో భాగంగా నూతన విద్యుత్ సౌకర్యం కల్పించారు. సిపిఎం కృషి ఫలితంగా ఐదేళ్ల తర్వాత ఈ గ్రామానికి అధికారులు విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఐదేళ్లుగా గ్రామస్థులు కాగడాల వెలుగులో భోజనం చేశారు. పండగలు కూడా కాగడాలు వెలుగులో చేసుకునేవారు. నేడు పోరాట ఫలితంగా కరెంట్ సౌకర్యం లభించింది. విద్యుత్ సౌకర్యం కల్పించిన అధికారులకు ఆ గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.
