త్వరలో ఉచిత బస్సు సౌకర్యం : ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ పూల నాగరాజు

ప్రజాశక్తి-కడప అర్బన్‌ : ఏపీ రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభమవుతుందని ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ పూల నాగరాజు పేర్కొన్నారు. మంగళవారం కడప ఆర్టిసి బస్టాండుకు చేరుకున్న చైర్మన్‌ కు డి ఎం డిల్లేశ్వరరావు స్వాగతం పలికారు. బస్టాండ్‌ ఆవరణలో మొక్క నాటారు. ఆర్టిసి బస్టాండ్‌, ఆర్టీసీ గ్యారేజీ, కార్గో సేవలు, ప్రయాణికులకు మంచినీటి సౌకర్యం ఉందా లేదా, నూతన బస్టాండులో జరుగుతున్న సిమెంట్‌ రోడ్డు పనులను పరిశీలించారు. ప్రయాణికులకు అందుతున్న సేవలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండులలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు. నివేదికను తయారుచేసి ముఖ్యమంత్రి దఅష్టికి తీసుకువెళతామన్నారు. ఎక్కడ ఏమి అవసరమో వాటిని సమకూర్చి మెరుగైన సౌకర్యాలను అందుబాటులోనికి తీసుకువస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు త్వరలో ఉచిత బస్సుల సౌకర్యాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఆర్టీసీ ఆసుపత్రి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఆర్‌ ఎం, ఇడి, డి ఎం బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. మరిన్ని విద్యుత్‌ బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మోడ్రన్‌ బస్‌ స్టేషన్లు, జోన్‌-1, జోన్‌ -2 డిపోలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందన్నారు. ఒక నెలలో నగరంలో సిటీ బస్సులను అందుబాటులోనికి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఆర్‌ ఎం గోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ మెరుగైన రవాణా సౌకర్యాన్ని ప్రజలకు కనిపిస్తున్నామని పేర్కొన్నారు. ఇయు నాయకులు చైర్మన్‌ ను సన్మానించారు. కార్యక్రమంలో ఈడి చంద్రశేఖర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ కన్యాకుమారి, సూపరింటెండెంట్‌ మంజుల, ఇయు అధ్యక్షులు కుమార్‌, కార్యదర్శి రాజశేఖర్‌, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️