పరిగిలో పింఛన్ పంపిణీ చేస్తున్న మంత్రి సవితమ్మ
ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్
జిల్లా వ్యాప్తంగా 2.69 లక్షల మంది పింఛనుదారులు ఉండగా శనివారం సాయంత్రం 6 గంటలకు 94.14 శాతం మందికి పింఛన్లు పంపిణీ చేశామని డిఆర్డిఎ పీడీ నర్సయ్య తెలిపారు. ఉదయం 6 గంటలకే పింఛను పంపిణీ ప్రారంభం అయ్యిందన్నారు. మంత్రి సవితమ్మ పరిగిలో, కలెక్టర్ టిఎస్ చేతన్ కొత్తచెరువులో పింఛన్లను పంపిణీ చేశారు.