అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
పుట్టపర్తి రూరల్ : పుట్టపర్తి విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు శ్రీ సత్య సాయి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఘన స్వాగతం పలికారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజవర్గం వజ్రకరూర్ మండలం చాయాపురం వద్ద హంద్రీ నీవా సుజల స్రవంతి కాలువ వెడల్పు పనుల పరిశీలనకు ప్రత్యేక విమానంలో పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి 12 గంటల ఒక్క నిమిషానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి రాష్ట్ర మంత్రులు సవితమ్మ, టిజి భరత్, ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డి,ఎమ్మెస్ రాజు,కందికుంట వెంకట ప్రసాద్,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి , జిల్లా కలెక్టర్, టీఎస్ చేతన్, జేసి అభిషేక్ కుమార్, ,ఎస్పీ వీ రత్న , మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప, తెలుగుదేశం జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ,స్థానిక ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు ఆర్డీవో సువర్ణ,పుట్టపర్తి నియోజకవర్గ కూటమి పార్టీల నాయకులు సిఎం కు ఘన స్వాగతం పలికారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని వజ్రకరూరు మండలం చాయాపురానికి హంద్రీనీవా కాలువ వెడల్పు పనుల ప్రారంభోత్సవంతోపాటు పనులు పరిశీలనకు పుట్టపర్తి విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12. 18 నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు.
హిందూపురం: హంద్రీనీవా కాలువ పనులను పరిశీలించేందుకు శుక్రవారం అనంతపురం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని హిందూపురం మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ కుమార్ కలిశారు. విమానాశ్రయంలో శ్రీ సత్య సాయి జిల్లా టిడిపి అధ్యక్షులు కొల్లకుంట అంజనప్పతో కలిసి డిఈ రమేష్ కుమార్ ముఖ్యమంత్రికి బొకే అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బేకరి గంగాధర్, మాజీ సర్పంచ్ హెచ్.ఎన్. రాము తదితరులు పాల్గొన్నారు.