సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కందికుంట
ప్రజాశక్తి-గాండ్లపెంట
టిడిపి కార్యకర్తల ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ భరోసా ఇచ్చారు. స్థానిక ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం కార్యకర్తలో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ టిడిపికి కార్యకర్తలు వెన్నముఖ అన్నారు. కార్యకర్తల సేవలు ఎనలేనివన్నారు. ఇప్పటికే ప్రతి మండలంలో సీసీ రోడ్లు, కదిరి నుంచి ఎన్పి.కుంట వరకూ తారు రోడ్డు వేశామన్నారు. గ్రామాల్లో తాగనీటి సమస్య ఉంటే నా దృష్టికి తెస్తే పరిష్కరిస్తానని తెలి పారు. అనంతరం ప్రధాన అంగనవాడీ కేంద్రంలో నిర్వహించిన కిశోరి వికాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలికలకు ఎదురయ్యే సమస్యలు, విద్య, ఆరోగ్యం, నైపుణ్యం, ఎదుగుదల, పోటీతత్వం, బాల్య వివాహాలు నిర్మూలన, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిడిపిఒ జయంతి, తహశీల్దార్ బి.బాబురావు, ఎంపిడిఒ వెంకటరామిరెడ్డి, సూపర్వైజర్ పద్మావతి, లక్ష్మీదేవి, జేఈలు రెడ్డివరప్రసాద్, కిరణ్కుమార్రెడ్డి, టిడిపి మండల కన్వీనర్ సి.కొండయ్య, వెంకటరమణారెడ్డి, సర్పంచులు ఎస్.రహంతుల్లా, ఎస్.శివప్ప నాయుడు, తదితరులు పాల్గొన్నారు.