వడ్డీ మాత్రమే కట్టించుకుని రుణాలు రెన్యువల్‌ చేయాలి

Apr 21,2025 21:41

బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహిస్తున్న నాయకులు 

                     తనకల్లు : పంటరుణాల రెన్యువల్‌లో బ్యాంకు అధికారులు అవలంభిస్తున్న విధానాలకు నిరసనగా ఎపి రైతుసంఘం, వామపక్షాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత కరువు పరిస్థితుల్లో పంటరుణాల రెన్యువల్‌లో బ్యాంకు అధికారులు అవలంభిస్తున్న వైఖరి సరికాదన్నారు. అసలు, వడ్డీ కడితేనే రుణాలు రెన్యువల్‌ చేస్తామని చెప్పడం అన్యాయమన్నారు. కేవలం వడ్డీ మాత్రమే కట్టించుకుని రుణాలు రెన్యువల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా బ్యాంకుల వద్ద నీడ, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఎం శివన్న, జిల్లా కమిటీ సభ్యులు వివి, రమణ, ఎస్వీ రమణ, చలపతి, శ్రీనివాసులు, సిఐటియు నాయకులు ఒంటెద్దు వేమన్న, సిపిఐ మండల కార్యదర్శి రెడ్డప్ప, రైతు సంఘం నాగేంద్ర, వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️