చిన్నారికి స్వీటు తినిపిస్తున్న మంత్రి సవిత
ప్రజాశక్తి-పెనుకొండ
కిశోరి వికాసం ద్వారా బాలికల సర్వతో ముఖాభివద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత అన్నారు. సోమవారం పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో గర్భిణులు, పౌష్టికాహారం, చిన్నారులకు మంత్రి అన్నప్రాసన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలికలకు ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ‘కిశోరి వికాసం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్య, ఆరోగ్యం, నైపుణ్యం, ఎదుగుదల, పోటీతత్వం, వ్యక్తిగత శుభ్రత వంటి అంశాలపై బాలికలకు అవగాహన కల్పించనున్నారని తెలిపారు. బాల్య వివాహాలు జరగకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఆడపిల్లలు స్కూల్ డ్రాప్ అవుట్లు కాకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరసింగప్ప, తహశీల్దార్ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్, సిడిపిఒ శాంత లక్ష్మి, ఆరోగ్య, అంగన్వాడీ కార్యకర్తలు, వెలుగు సభ్యులు, వెల్ఫేర్ సిబ్బంది, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.