పోస్టర్లు విడుదల చేస్తున్న నాయకులు
కదిరి అర్బన్ : బాల్యవివాహాలను అరికట్టడం అందరి బాధ్యత అనిరెడ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భానుజా పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక రోడ్డు భవనాల అతిధిగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాల్య వివాహాల నివారణపై ప్రచురించిన పోస్టర్లను ఆమె విడుదల చేశారు. చర్చి మసీద్ దేవాలయాల మత పెద్దల సమక్షంలో బాల్య వివాహాల నివారణ కొరకు తీసుకోవలసిన చర్యలపై ఆమె వివరించారు. బాల్య వివాహాలపై ఉన్న చట్టాలను ప్రజలకు తెలిపే విధంగా ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్స్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ ఎల్లప్ప, సిబ్బంది పాల్గొన్నారు.
కదిరి టౌన్ :బాల్య వివాహల నివారణకు కృషి చేద్దామని సమత స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ ఆదినారాయణ రెడ్డి, సంస్థ జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీనివాసులు కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమత స్వచ్ఛంద సంస్థ శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలలో బాలల హక్కుల పరిరక్షణ, బాల్యవివాహాల నివారణ కోసం పనిచేస్తోందన్నారు. బాల్య వివాహాలను నివారించడానికి అన్ని మతాలకు చెందిన మత పెద్దలతో అవగాహన ప్రచారాలను నిర్వహించడం జరిగిందన్నారు. అక్షయ తృతీయ, వివాహ సీజన్ దష్ట్యా బాల్య వివాహాలు నివారించడానికి కలసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీనివాసులు నాయుడు, కమ్యూనిటీ మొబిలైజర్ బాబ్జాన్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.