మాక్డ్రిల్ నిర్వహిస్తున్న పోలీసులు
ప్రజాశక్తి-పుట్టపర్తి రూరల్
ఉగ్రవాదులు దాడులు చేస్తే ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి.. వారిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై భద్రతపరంగా బుధవారం శ్రీ సత్యసాయి విమానాశ్రయంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు కలెక్టర్ టిఎస్.చేతన్ ఎస్పీ వి.రత్నలు పుట్టపర్తి విమానాశ్రయంలో జరిగిన మాక్ డ్రిల్ను పరివేక్షించారు. డీఎస్పీలు విజయకుమార్, శ్రీనివాసులు, ఆర్ఐలు మహేష్, వలి ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. విమానాశ్రయంలో ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు, వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైరన్లు మోగినప్పుడు తక్షణమే ఏమి చేయాలి.. రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలన్న విషయాలపై స్పెషల్ పార్టీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఫైర్, హెల్త్ సిబ్బంది వెంటనే చేపట్టే చర్యలు మాక్ డ్రిల్ ద్వారా చూపించారు. దాడులకు పాల్పడితే ఆ సమయంలో ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి, వివిఐపిలకు ఎలాంటి రక్షణ కల్పించాలి.. ప్రమాదం జరిగిన వెంటనే వారిని ఆంబులెన్స్ ద్వారా హాస్పిటల్కు ఎలా తరలించాలి.. బాంబులు అమర్చిన ప్రాంతాన్ని డాగ్స్ స్క్వాడ్ ద్వారా గుర్తించి వాటిని ఎలా డిస్పోజల్ చేయాలనే విషయాలపై మార్క్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు విజయకుమార్, శ్రీనివాసులు, ఆర్డీవో సువర్ణ, తహశీల్దార్ కళ్యాణ్, సిఐలు, సునీత, సురేష్, ఆర్ఐలు మహేష్, వలి, ఎస్బి ఎస్ఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐలు లింగన్న, కృష్ణమూర్తి ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.