ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం : ఎమ్మెల్యే

May 8,2025 22:01

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కందికుంట

               కదిరి అర్బన్‌ : ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు. గురువారం స్థానిక ఆర్టీసీ డిపో ఆవరణములో నూతన ఆర్టీసీ బస్సును ఆయన ప్రారంభించారు. అంతకు ముందు ఆర్టీసీ డిఎం ఐనుద్దీన్‌, సిబ్బంది ఎమ్మెల్యే కందికుంటకు ఘనంగా స్వాగతం పలికారు. ఆర్టీసీ బస్సును ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ ఆర్టీసీ బస్సును నడిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

నూతన వైద్యశాల ప్రారంభం : పట్టణ పరిధిలోని సైదాపురం రాయల్‌ ఎన్ఫీల్డ్‌ షోరూమ్‌ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన భారతి కంటి ఆసుపత్రినిఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ ప్రారంభించారు. వైద్యశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారతి కంటి వైద్యశాల నిర్వాహకులు కూటమి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం : పట్టణంలోని ఆర్డీవోకార్యాలయం లో గురువారం ఆర్డీవో వీవీఎస్‌ శర్మ సమక్షంలో సబ్‌ డివిజనల్‌ పరిధిలో విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యేకందికుంట వెంకటప్రసాద్‌ మాట్లాడుతూ సంబంధిత అధికారులు చేపట్టాల్సిన విధులను వివరించారు.ఈ కార్యక్రమంలో కదిరి తహశీల్దార్‌ మురళీకృష్ణ, ఎన్పీకుంట తహశీల్దార్‌ దేవేంద్ర, కదిరి రెవెన్యూ డివిజన్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️