ఆర్‌డిటి ఎఫ్‌సిఆర్‌ఎ కొనసాగించాలి : సిఐటియు

Apr 28,2025 21:46

 ఆర్డీవోకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

                      ధర్మవరం రూరల్‌ : ఆర్‌డిటి సేవలు కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సిఆర్‌ఎను పునరుద్ధరించాలని సిఐటియు నాయకులు కోరారు. ఈ మేరకు వారు సోమవారం స్థానిక ఆర్డీవోకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్‌ జేవి.రమణ, కో కన్వీనర్లు టి.అయుబ్‌ ఖాన్‌ ఎల్‌.ఆదినారాయణ మాట్లాడుతూ. ఆర్‌డిటి ఎఫ్‌సిఆర్‌ఎ అనుమతులను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్‌.నాగవేణి, ఐ.లక్ష్మీదేవి, వరలక్ష్మి, సన్నప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

నల్లమాడ : పేదలకు నిరాశ్రయులకు రోగులకు ప్రతిభా విద్యార్థులకు అండగా ఉన్న ఆర్డీటీని రక్షించుకుందామని సిపిఎం నాయకులు అన్నారు. ఈ మేరకు ఆపార్టీ నాయకులు గోవిందు, రామయ్య, రాజు, మల్లిఖార్జున మాట్లాడుతూ ఆర్డీటీకి నిధులు రాకుండా అడ్డుకోవటం అన్యాయమన్నారు.

పుట్టపర్తి క్రైమ్‌ :ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధికి విశిష్ట కృషిచేసిన ఆర్డీటీనికాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని లంబాడి హక్కుల పోరాట సమితి నియోజకవర్గ కార్యదర్శి రంగనాథ్‌ నాయక్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం పుట్టపర్తి కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ కు ఆయన ఆధ్వర్యంలో నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఆర్డీటీకి ఎఫ్‌సిఆర్‌ఎను పునరుద్ధరించాలని కలెక్టర్‌ చేతన్‌ కోరారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల నాయకులు రమణ నాయక్‌, గోనే నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️