సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ టిఎస్.చేతన్
ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్
జిల్లాలో ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టిఎస్.చేతన్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ పనులకు సంబంధించి పురోగతిపై మంగళవారం నాడు కలెక్టరేట్లో హౌసింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, డిఇలు, ఈఈలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జూన్లో సామూహిక గహప్రవేశం నిర్వహించి మూడు లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలనే ప్రభుత్వం లక్ష్యం నిర్ధేశించిందన్నారు. జిల్లాలో జూన్ 12వ తేదీ నాటికి 10,368 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉండగా 7020 ఇళ్లు ఇంకా పూర్తి కాలేదన్నారు. గహనిర్మాణ ప్రాజెక్టుల నిర్మాణానికి వేసవి అనుకూలంగా ఉన్నందున వారి లక్ష్యాలను సాధించాలని అధికారులను ఆదేశించారు. డివిజన్ స్థాయిలో ఆర్డీవోల ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డీఈఈలు సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవాలని ఆదేశించారు. మండల స్థాయిలో కూడా సంబంధిత మండల అధికారులు ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవాలని తెలిపారు. జిల్లాలో 8 మండలాలు గహ నిర్మాణంలో చాలా వెనకబడి ఉన్నాయని తెలిపారు. కదిరి అర్బన్, ధర్మవరం అర్బన్, లేపాక్షి, రామగిరి, సోమేందపల్లి, హిందూపురం, కొత్తచెరువు, సంబంధిత హౌసింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టి, లక్షలను అధిగమించే విధంగా కషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు టి.శంకర్ లాల్ నాయక్, జి.శ్రీనివాస్, బి.శివ కుమార్ నాయక్, కె.వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.