విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కందికుంట
కదిరి టౌన్ : అధికారం కోల్పోగానే నియోజకవర్గ ప్రజలకు వైసీపీ శ్రేణులకు దూరమయ్యారని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు. కదిరి పట్టణంలోని తాయి గ్రాండ్ లో ఎన్పీకుంట మండలం టిడిపి నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ కదిరిలో వైసీపీకి నలుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నామని గొప్పలు చెప్పుకుంటారని సొంత శ్రేణులకు భరోసా కల్పించే నాయకుడా పార్టీకి కరువయ్యారని ఎద్దేవా చేశారు. రాజకీయలలో స్థిరమైన నాయకత్వమే ముఖ్యమని తాను ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎదురె¸డ్డి నిలబడ్డానని చెప్పారు. నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషితో నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగురవేసామని అన్నారు. ఎన్పి కుంట మండలంలో బలమైన స్థిరమైన నాయకత్వం టిడిపికి ఉందని అందరూ సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. వైసీపీ అధినేత జగన్ పై ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ముంబై నటి జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు పాపం పండి జైలుకు వెళ్లారని అన్నారు. బెదిరించి మళ్ళీ అధికారంలోకి వస్తానని పగటి కలలు కంటున్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. అవినీతిలో పూర్తిస్థాయిలో కురుకుపొయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.