వీరాపురం కొంగల రక్షణకు చర్యలు

వీరాపురంలో చెట్టుపై ఉన్న సైబీరియన్‌ పక్షులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌

ప్రజాశక్తి – చిలమత్తూరు

మండలంలోని వీరాపురం-వెంకటాపురం చెరువులు అరుదైన సైబీరియన్‌ పక్షులకు విడిదిగా ఉన్నాయని, ఈ పక్షుల రక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటామని కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌ తెలిపారు. సైబీరియన్‌ పక్షులు ఉండే వీరాపురం,వెంకటాపురం చెరువులను కలెక్టర్‌ శనివారంసందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదూర సైబీరియా ప్రాంతాల నుంచి ప్రతి ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు పక్షులు వీరాపురం, వెంకటాపురం చెరువుల్లోకి వస్తుంటాయన్నారు. ఈ విలువైన పక్షులను సంరక్షిస్తూ, వీరాపురాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువుల్లో నీటి నిల్వ పెంపు, పూడికతీత పనులు, మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. పర్యాటకులకు వసతి సదుపాయాలు, వాచ్‌ టవర్ల ఏర్పాటునూ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి చక్రపాణి, పెనుకొండ అటవీ క్షేత్రాధికారి శ్రీనివాసులు రెడ్డి, చిలమత్తూరు తహశీల్దార్‌ వెంకటేష్‌, వీరాపురం సర్పంచి లక్ష్మీపతి రెడ్డి పాల్గొన్నారు.

➡️