ప్రజాశక్తి – శ్రీకాకుళం
ప్రభుత్వ సెలవు రోజుల్లో, రెండో శనివారం, ఆదివారం రోజుల్లో పాఠశాలలు తెరవరాదని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.తిరుమల చైతన్య ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించి ఏ పాఠశాలలైనా తరగతులు నిర్వహిస్తే వాటిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.