మాట్లాడుతున్న జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా
జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా
ప్రజాశక్తి – శ్రీకాకుళం
న్యాయ వ్యవస్థపై అవగాహన అవసరమని జిల్లా జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. న్యాయ సేవా సదన్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. న్యాయ విద్యార్థులకు కోర్టులో జరిగే కార్యకలాపాలను వివరించి, అవసరమైన చట్టాలపై సమగ్ర అవగాహన కల్పించారు. న్యాయ వ్యవస్థను సమర్థవంతంగా అర్థం చేసుకోవాలంటే విద్యార్థులు కోర్టు ప్రక్రియలను దగ్గర నుంచి గమనించాలన్నారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండడం సామాజికంగా ప్రయోజనకరమన్నారు. కార్యక్రమంలో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి.సువర్ణరాజు, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, ఎంపిఆర్ లా కళాశాల ప్రిన్సిపాల్, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు.