‘ఉపాధి’ బకాయిలు చెల్లించాలి

జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు మూడు

మాట్లాడుతున్న సింహాచలం

శ్రీకాకుళం: జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు మూడు నెలలుగా కూలి డబ్బులు చెల్లించక పోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిర్ల ప్రసాదరావు, గంగరాపు సింహాచలం ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని వ్యవసాయ కార్మిక సంఘ కార్యాలయంలో గురువా రం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ జీతభత్యాలు రూ.లక్షలు పెంచుకుంటున్నారని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మండుటెండలో పనిచేస్తున్న కూలీల ఇబ్బందులను పరిష్కరించే శ్రద్ధ చూపించడం లేదన్నారు. ఉపాధి కూలీలు పనులు చేయకుండా డబ్బులు తీసుకుంటున్నారని పలువు రు ప్రజాప్రతినిధులు తమ పెత్తందారీ స్వభావాన్ని వెళ్లగక్కుతున్నారన్నారు. పేదల ఓట్లతో అందల మెక్కిన వారు రాజభోగాలు అనుభవిస్తున్నారన్నారు. అటువంటి వారు పేదలపై చిన్నచూపు తగదన్నా రు. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉందని, అందువల్ల సకాలంలో వేతనాలు విడుదల చేయించి ఉపాధి కూలీలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సంఘ నాయకులు కె.ఎర్రయ్య, భవానిపాల్గొన్నారు.

➡️