బాలికలదే పైచేయి

జిల్లాలో ఈ ఏడాది మార్చి 17 నుంచి

 

85.40 శాతం మంది ఉత్తీర్ణత సాధించిన బాలికలు

జిల్లాలో 82.41శాతం ఉత్తీర్ణత నమోదు

రాష్ట్రంలో రెండు నుంచి 14కు దిగజారిన జిల్లా ఫలితాలు

జిల్లా టాపర్‌గా హరిపురం స్కూల్‌ విద్యార్థిని జోషిత

పదో తరగతి ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 85.40 శాతం ఉత్తీర్ణత సాధించి శభాష్‌ అనిపించుకున్నారు. ఈ ఏడాది పరీక్షలకు 28,277 మంది హాజరు కాగా 23,219 మంది విద్యార్ధులు (82.11 శాతం) పాసయ్యారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణతా శాతం దిగజారింది. 2023-24 విద్యా సంవత్సరంలో 93.35 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఫలితాల పరంగా గతేడాది రెండో స్థానంలో ఉండగా, ఈ ఏడాది 14వ స్థానానికి పడిపోయింది. వ్యక్తిగత మార్కుల్లోనూ పలువురు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. మందస మండలం హరిపురం జెడ్‌పి స్కూల్‌కు చెందిన కంచరాన జ్యోషిత 597 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానం దక్కించుకుని ప్రభుత్వ పాఠశాలల సత్తా చూపారు.ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధిజిల్లాలో ఈ ఏడాది మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు జిల్లాలో మొత్తం 28,277 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 23,219 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు 13,889 మంది పరీక్షలు రాయగా, 11,861 మంది పాసయ్యారు. 85.40 శాతం ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలకు 14,287 మంది బాలురు హాజరు కాగా 11,358 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 79.50 శాతం మంది పాసయ్యారు. పలురకాల యాజమాన్యాల కింద పనిచేస్తున్న పాఠశాలలూ మంచి ఫలితాలను సాధించాయి. బిసి, ఎస్‌సి వసతిగృహాల్లో చదువుకున్న విద్యార్థులు అత్యధిక మార్కులు పొంది సత్తా చాటారు. ఎపి మోడల్‌ స్కూల్‌, కెజిబివి పాఠశాలల విద్యార్థులూ ఉత్తమ ఫలితాలు సాధించారు. మహాత్మా జ్యోతిరావు పూలే, ఎపి రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌, సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూల్స్‌ 90 శాతానికి పైగా ఫలితాలు సాధించాయి. మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలలు అత్యధిక ఉత్తీర్ణతా (94.33 శాతం) సాధించాయి.కుప్పిలి పాఠశాలలో దారుణ ఫలితాలుమార్చి 23న నిర్వహించిన ఇంగ్లీష్‌ పరీక్ష సందర్భంగా చూచిరాతలు, ఉపాధ్యాయుల సస్పెన్షన్ల అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. డిఇఒ తిరుమల చైతన్య దుందుడుకు వైఖరిని నిరసిస్తూ ఉపాధ్యాయులు పలురూపాల్లో ఆందోళనలకు దిగడంతో తర్వాత 13 మందిపై సస్పెన్షన్‌ ఎత్తివేశారు. పరీక్షల సమయంలో జరిగిన ఘటన విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ పరీక్షా కేంద్రంలో 51 మంది పరీక్షలు రాయగా నలుగురే పాసయ్యారు. ఎనిమిది శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. డిఇఒ తీరు వల్లే తమ పిల్లలు ఫెయిలై పోయారని పలువురు తల్లిదండ్రులు మండిపడుతున్నారు.ప్రథమ శ్రేణిలో అత్యధిక ఉత్తీర్ణులు బాలికలేపదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం పరంగా పైచేయి సాధించిన బాలికలు ప్రథమ, ద్వితీయ శ్రేణిలోనూ వారి హవా కనిపించింది. బాలికలు 5,888 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కాగా బాలురు 5,865 మంది ఉత్తీర్ణత చెందారు. ద్వితీయ శ్రేణిలో 5,844 మంది బాలికలు ఉత్తీర్ణత చెందగా బాలురు 5,726 మంది పాసయ్యారు. టాప్‌ లేపారుపదో తరగతి మందస మండలం మకరజ్వాల గ్రామానికి చెందిన కంచరాన జోషిత 600 మార్కులకు గాను 597 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల సత్తా చాటారు. ఈమె హరిపురం జెడ్‌పి స్కూల్‌లో పదో తరగతి చదివారు. జోషిత తండ్రి మాధవరావు, తల్లి లేపాక్షి ఇరువురూ ఉపాధ్యాయులే. అంతా ప్రయివేట్‌, కార్పొరేట్‌ మోజులో పడి పిల్లలను ఆయా స్కూళ్లకు పంపిస్తుంటే వీరు మాత్రం ప్రభుత్వ పాఠశాలకు పంపి ఆదర్శంగా నిలిచారంటూ గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని జోషితకు ప్రధానోపాధ్యాయులు జి.ఉమారాజు, ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ చైర్మన్‌ కొంచాడ సురేష్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. సారవకోట మండలం బుడితి గ్రామానికి చెందిన పాతోజు సాహితీ 597 మార్కులు సాధించారు. ఈమె తండ్రి తిరుమలరావు, కళ్యాణిలు ఇరువురూ ఉపాధ్యాయులే. సోంపేట మండలం కొర్లాంకు చెందిన శ్రావ్య లలితాంజలి 597 మార్కులు సాధించింది. ఆమె తండ్రి సూర్యనారాయణ సోంపేట మండలం గొనకపాడు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. తల్లి జయలక్ష్మి గృహిణి. శ్రావ్య లలితాంజలి కాశీబుగ్గ శ్రీచైతన్య స్కూల్‌లో పదో తరగతి చదివింది.సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలలుపదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ఫలితాలు సాధించారు. హరిపురం స్కూల్‌ విద్యార్థిని జోషిత 597 మార్కులు సాధించారు. పలు ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్ధులు రెండో స్థానం సాధించారు. రొంపివలస జెడ్‌పి స్కూల్‌, బూర్జ మండలం ఒవిపేట మోడల్‌ స్కూల్‌, నరసన్నపేటకు చెందిన మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్‌ విద్యార్ధులు 593 మార్కులు చొప్పున సాధించి జిల్లాలో రెండో స్థానం దక్కించుకున్నారు. మేనేజ్‌మెంట్ల వారీగా ఫలితాలు ఇలా…మేనేజ్‌మెంట్‌ హాజరైన విద్యార్థులు ఉత్తీర్ణత శాతంమహాత్మా జ్యోతిరావు పూలేస్కూల్స్‌ 547 516 94.33ప్రభుత్వ పాఠశాలలు 2,511 1,777 70.77గిరిజన ఆశ్రమ పాఠశాలలు 608 506 83.22కెజిబివి 987 883 89.46మున్సిపల్‌ స్కూల్స్‌ 1,171 861 75.53మోడల్‌ స్కూల్స్‌ 1,173 1051 89.60ప్రైవేట్‌ స్కూల్స్‌ 6,618 6,338 95.77రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ 157 151 96.18ఇన్‌స్టిట్యూషన్స్‌సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ 525 475 90.48పాఠశాలలు గిరిజన సంక్షేమ పాఠశాలలు 71 62 87.32జిల్లా పరిషత్‌ స్కూల్స్‌ 13,909 10,599 76.20మొత్తం 28,277 23,219 82.11నాలుగేళ్లలో ‘పది’ ఉత్తీర్ణతా శాతం వివరాలుసంవత్సరం హాజరైన ఉత్తీర్ణత చెందిన శాతం విద్యార్థులు విద్యార్థులు2021-22 35,944 28,116 782022-23 28,724 24,279 84.532023-24 28,745 26,836 93.352024-25 28,277 23,219 82.11

➡️