మెజిస్ట్రేట్ల నియామకానికి వినతి

జిల్లా కోర్టులో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హైకోర్టు

పుష్పగుచ్ఛం అందజేస్తున్న న్యాయవాదులు

శ్రీకాకుళం లీగల్‌:

జిల్లా కోర్టులో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హైకోర్టు జడ్జి సత్తి సుబ్బారావు అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన వర్క్‌షాప్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం అతిధిగృహంలో జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు తంగి శివప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదరరావు అధ్యక్షతన జిల్లా బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ కోర్టు, ఎగ్జిక్యూటివ్‌ కోర్టు, మొబైల్‌ కోర్టులకు తక్షణమే మెజిస్ట్రేట్లను నియామకం చేయాలని, మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఆయన ఈ సమస్యలు తన దృష్టిలో ఉన్నాయన్నారు. త్వరలో నియామకాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఇప్పిలి సీతరాజు, కార్యవర్గ సభ్యులు ఎం.భవానీప్ర సాద్‌, జి.వనజాక్షి, వరప్రసాద్‌, రమణమూర్తి, స్టేట్‌ బార్‌ మెంబర్‌ గేదేల వాసుదేవరావు, సీనియర్‌ న్యాయవాదులు పి.వి.రమణ ధయాల్‌, పి.వి.రమణారావు, ఎన్ని సూర్యారావు, గణపతిపట్నాయక్‌, ఎం.క్రాంతి, కిలారి ఈశ్వరరావు, జె.తిరుపతిరావు, బి.ఎస్‌.చలం, శేషగిరిరావు, అపిష్‌నాయుడు, ఎం.అన్నంనాయుడు, శంకర్‌నారాయణ పాల్గొన్నారు.

 

➡️