అధికారులతో మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి – కోటబొమ్మాళి
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టెక్కలి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేదుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మండలంలోని నిమ్మాడలో గల క్యాంపు కార్యాలయంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అమలు, పనితీరుపై నీటిపారుదల అభివృద్ధి సంస్థ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని లిఫ్ట్ ఇరిగిగేషన్ పరిస్థితి, వాటి పనితీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 14 ఉన్నాయని తెలిపిన అధికారులు, వీటన్నింటినీ పూర్తిస్ధాయిలో వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఆధునీకరణ పనులు చేపట్టేందుకు ఎంత నిధులు అవసరమో ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. శ్రీపురం, కురుడు, పొడుగుపాడు, నారాయణవలస, కొత్తపేట, నారాయణపురం, చిన్నసాన, నిమ్మాడ, పోలవరం, సుభంద్రాపురం, మదనగోపాల సాగరం ఎత్తిపోతల పథకానికి రూ.12 కోట్ల వరకు నిధులు అవసరం ఉంటుందని మంత్రికి అధికారులు వివరించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, నిధులు మంజూరు చేసే బాధ్యత తనదని తెలిపారు. తొలి ప్రాధాన్యతా క్రమంలో మదనగోసాగరం పనులు పూర్తి చేయాలని మంత్రి సూచించగా, వాటికి రూ.4.80 లక్షలు అవసరం ఉంటుందని అధికారులు మంత్రికి వివరించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ఇఇ కె.వి సుబ్రమణ్యం, డిఇ కామరాజు, పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.అర్హులందరికీ సంక్షేమ పథకాలుఅర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బారు నిర్వహించి వినతులు స్వీకరించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, నూతన ఫించన్లు, ఇళ్లు మంజూరు చేయాలని ప్రజల నుంచి పెద్దఎత్తున వినతులు వచ్చాయి.