నతులను స్వీకరిస్తున్న ఎమ్మెల్యే శంకర్
- ఎమ్మెల్యే గొండు శంకర్
ప్రజాశక్తి- శ్రీకాకుళం రూరల్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్ర మం ప్రజా సమస్యల పరిష్కారానికేనని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని తహశీల్దార్ కార్యాలయంలో రూరల్ మండలాల సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను గురువారం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే ప్రజల నుంచి పెద్దఎత్తున వినతులు వస్తున్నాయన్నారు. పింఛను మంజూరు చేయాలని, ఇళ్లు బిల్లులు అందించాలని, తాగునీరు, సాగునీరు, తదితర సమస్యలకు సంబంధించిన వినతులు అధికంగా అందించినట్లు తెలిపారు. రీ సర్వే చేసిన దానికి ఎల్పి నంబర్లు ఇచ్చి జాయింట్ జాయింట్ అకౌంట్లో ఇవ్వడంతో ఈ క్రాస్ కూడా జరగని పరిస్థితి నెలకొందని తెలిపారు. ధాన్యం అమ్మకా లు, కొనుగోలు కూడా అవకాశం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఏడాదిగా కొత్త పింఛన్లు అందించిన సందర్భాలు కూడా లేవన్నారు. జగనన్న కాలనీలో ఇళ్లు మంజూరైనా బిల్లులు చెల్లించలేదని, ప్రజల నుంచి వినతలెక్కు వగా అందుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో తహశీల్దార్ రామారావు, ఎంపిడిఒ బొడ్డేపల్లి శైలజ, కూటమి నాయకులు పాల్గొన్నారు. వి