మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

ఆఫ్‌షోర్‌ నిర్వాసిత కాలనీలో మౌలిక వసతులు

తాగునీటి కుళాయిని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శిరీష

ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస : ఆఫ్‌షోర్‌ నిర్వాసిత కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మండలంలోని రామకృష్ణాపురం ఎన్‌టిఆర్‌ కాలనీలో జలజీవన్‌ పథకంలో భాగంగా రూ.3.16 కోట్లతో ఏర్పాటు చేసిన తాగునీటి పథకాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిర్వాసితులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేస్తుందని తెలిపారు. నిర్వాసితుల కాలనీలో తాగునీటికి ఇబ్బంది లేకుండా కుళాయి ద్వారా నీటిని అందించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ వసంత్‌ కుమార్‌, ఎపి ట్రేడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వజ్జ బాబాబూరావు, టిడిపి మండల అధ్యక్షులు కూత్తుమ లక్ష్మణ్‌ కుమార్‌, టిడిపి నాయకులు పీరుకట్ల విఠల్‌రావు, లోడగల కామేశ్వరరావు, సప్పగా నవీన్‌, కె.నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

 

➡️