చెరువు పూడికతీత పనులు ప్రారంభం

May 5,2025 17:29 #Konaseema, #Pond dredging work

ప్రజాశక్తి – కపిలేశ్వరపురం : మండల కేంద్రమైన కపిలేశ్వరపురం రావుల చెరువు మట్టి పూడికతీత పనులను సోమవారం ప్రారంభించారు. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం అజాధీకా అమృత్ సర్ పథకం రూ. 7లక్షల అంచనాతో 3 వేల పని దినాలతో ఈ చెరువు పూడిక తీత పనులకు గ్రామ సర్పంచ్ సాకా శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాకా శ్రీనివాస్, ఉప సర్పంచ్ బొక్క రాంబాబు, నీటి సంఘం అధ్యక్షులు కొరపాటి రాంబాబు, కూటమి నాయకులు నామాల బొజ్జియ్య, కుడిపూడి సురేష్, నేతల అన్నవరం, ఫీల్డ్ అసిస్టెంట్ షేక్ నాగూర్, మేట్లు, ఉపాధి కూలీలు, తదితరులు, పాల్గొన్నారు.

➡️