రూ.50 లక్షలతో లైటింగ్‌ ఏర్పాటు : సుడా చైర్మన్‌

May 8,2025 21:10

ప్రజాశక్తి – వీరఘట్టం : వీరఘట్టం గ్రామ ప్రధాన రహదారి మధ్యలో సుడా ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో లైటింగ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సుడా చైర్మన్‌ కోరికాన రవికుమార్‌ తెలిపారు. గురువారం ప్రధాన రహదారిని పరిశీలించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఒట్టిగెడ్డ వంతెన నుంచి ప్రియాంక ఫిల్లింగ్‌ స్టేషన్‌ వరకు 1.75 కిలోమీటరు దూరంలో లైటింగ్‌ పనులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో మాట్లాడి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. లైటింగ్‌ పనులు పూర్తయిన తర్వాత కోడి రామ్మూర్తి నాయుడు విగ్రహాన్ని ప్రధాన రహదారి మధ్యలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం సుడా చైర్మన్‌, ఎమ్మెల్యే, ఎస్‌ఇ సుగుణాకర్‌ రోడ్డు మ్యాప్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ప్లానింగ్‌ అధికారి అమర్నాథ్‌, కూటమి నాయకులు పి.కృష్ణమూర్తినాయుడు, ఉదయాన ఉదయభాస్కర్‌, బల్ల హరి, జామి లక్ష్మీనారాయణ, మాచర్ల అనిల్‌, జనసేన జానీ, ఎం.పుండరీకం, కె.ధర్మారావు, కె.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.పాలకొండ అభివృద్ధే ధ్యేయంపాలకొండ : స్థానిక నగర పంచాయతీ అభివృద్ధే తన చేయమని సుడా చైర్మన్‌ కోరికన రవికుమార్‌ అన్నారు. గురువారం స్థానిక నగర పంచాయతీలో గల వెంకటరాయిని కోనేరును పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులతో మాట్లాడి అభివృద్ధి కోసం చర్చించారు. వెంకటరాయుని కోనేరును పార్క్‌గా చేసేలా చూడాలన్నారు. అవసరమైన నిధులు తాను సమకూరుస్తానన్నారు. కూటమి ప్రభుత్వం నగర పంచాయతీ అభివృద్ధి చెందాలన్నారు. దీంతో పాటు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, నగర పంచాయతీ సమన్వయకర్త పల్లా కొండలరావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కె.అప్పలనాయుడు, పట్టణ అధ్యక్షులు గంట సంతోష్‌ కుమార్‌, వైస్‌ ఎంపిపి వాకుమూడి అనిల్‌, గంగునాయుడు, కొంచాడ అరుణ తదితరులు ఉన్నారు.

➡️