ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయాలి

May 5,2025 17:07

ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపిటిఎఫ్) రాష్ట్ర సంఘం పిలుపు మేరకు విజయనగరం మండల రెవెన్యూ కార్యాలయం ముందు సోమవారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్తే శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రాథమిక పాఠశాలలో అంటే ఒకటి నుంచి ఐదు తరగతిలో మోడల్ ప్రాథమిక పాఠశాల లేదా బేసిక్ ప్రాథమిక పాఠశాలలనే కొనసాగించాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలలో రెండు ఎస్జీటీ పోస్టులు ఉండే విధంగా ఉండాలని అన్నారు. ప్రతి ఉన్నత పాఠశాలలో హెచ్ఎం, పిడి పోస్టులు మంజూరు చేయాలని, 45 మంది విద్యార్థులు దాటిన చోట రెండవ సెక్షన్ ఇవ్వాలని అన్నారు. మాతృభాష మాధ్యమాన్ని విద్యాహక్కు చట్టంలో పేర్కొన్న విధంగా కొనసాగించాలని, సిపిఎస్, జిపిఎస్ రద్దు చేయాలని అన్నారు. మెమో నెంబర్ 57 ప్రకారం 2003 డీఎస్సీ వారికి వెంటనే ఓపిఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 12వ పిఆర్సి కమిషన్ వేసి ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న మూడు డిఎల్ ను తక్షణమే ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బంకురు జోగినాయుడు, రాష్ట్ర కౌన్సిల్ కర్రి రవి, పి.వి.ప్రసాద్, మజ్జి రమేష్ ,గురుమూర్తి, తిరుమలరెడ్డి శ్రీనివాసరావు, సిహెచ్ కోటేశ్వరరావు, మర్రాపు శ్రీనివాసరావు, కె శ్రీనివాసన్ ,సంపూర్ణ లత కృష్ణమూర్తి, పి. లత తదితరులు పాల్గొన్నారు.

➡️