కనిగిరిలో ఉపాధ్యాయుల నిరసన

May 5,2025 11:42 #in Kanigiri, #Teachers' protest

కనిగిరి (ప్రకాశం) : ఏపీటీఎఫ్‌ రాష్ట్ర యూనియన్‌ పిలుపు మేరకు కనిగిరి తాసిల్దార్‌ కార్యాలయం ఎదుట సోమవారం ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి నాయబ్‌ రసూల్‌ మాట్లాడుతూ … జాతీయ విద్యా విధానము, విద్యాహక్కు చట్టంలో పేర్కొన్న మేరకు అన్ని పాఠశాలల్లో మాతృభాష మాధ్యమాన్ని కొనసాగించాలన్నారు. సి.పి.యస్‌. ,జి.పి.యస్‌. రద్దు చేయాలని తెలిపారు. మెమో నెం. 57 ప్రకారం 2003 డి.యస్‌.సి వారికి వెంటనే ఓ.పి.యస్‌. అమలు చేయాలన్నారు. 12వ పి.ఆర్‌.సి కమిషన్‌ వెంటనే నియమించి, ఐ.ఆర్‌. ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ లో ఉన్న మూడు డి.ఏ లను తక్షణమే ప్రకటించాలన్నారు. 11వ పి.ఆర్‌.సి బకాయిలతో పాటు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అన్ని రకాల ఆర్థిక బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

➡️