ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : మత్స్యకార గ్రామమైన ఉప్పాడ నాయకర కాలనీలో సీతా రాముడు, సీత, లక్ష్మణుడు ఉత్సవ విగ్రహాలు చోరీకి గురయ్యాయి. గురువారం అర్ధరాత్రి సమయంలో ఈ విగ్రహాలు చోరీ గురైనట్లు చెబుతున్నారు.. గత ఏడాది మత్స్యకార గ్రామం నాయకులు ఆలయం నిర్మించడం జరిగింది. విగ్రహాలు చోరీకి గురవడంతో గ్రామానికి అరిష్టమని పలువురు చెబుతున్నారు. నిత్యం ఉప్పాడ గ్రామంలో అనేక రూపంలో చోరీలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు వాపోతున్నారు.
