ప్రజాశక్తి – పెద్దాపురం (కాకినాడ) : తమ సమస్యలు పరిష్కారం కోరుతూ … మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాలుగవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న సమ్మె శిబిరంలో ఇంజనీరింగ్ కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … తమ సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు సుంకర నాగేశ్వరరావు, కెవి రమణ, బి భద్రరావు, జీ సతీష్, జి నాగేశ్వరరావు, వి భాస్కర్, ఎస్ సత్తి రాజు, డి రాజు, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
