ప్రజాశక్తి-భట్టిప్రోలు: రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ని సచివాలయంలోని ఆయన చాంబర్లో మంగళ వారం మధ్యాహ్నం ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెని క్రిస్టిన, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్య ప్రసాద్కు పుష్పగుచ్చాన్ని అందించారు. వీరి మధ్య పలు విషయాలపై చర్చలు జరిగాయి. అదేవిధంగా కత్తెర దంపతులను మంత్రి శాలువాతో సత్కరించారు.
