ప్రజాశక్తి-చిలకలూరిపేట : పొగాకు కొనుగోలు చేయకుండా రైతుల జీవితాలతో కంపెనీలు, ప్రభుత్వం ఆడుకుంటున్నాయని కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ అన్నారు. మండల పరిధిలోని మద్దిరాల, కమ్మవారిపాలెం, గోవిందపురం, కోమిటినేనివారిపాలెం, ఇర్లపాడు, గంగన్నపాలెం, కావూరు, లింగంగుంట్ల తదితర గ్రామాల్లో పొగాకు రైతులను సంఘం నాయకులు సోమవారం కలిసి మాట్లాడారు. పొగాకు కొనుగోళ్లు ఎక్కడా జరగడం లేదని, కొన్నిచోట్ల వ్యాపారు రూ.ఆరేడు వేలకు అడుగుతున్నారని రైతులు చెప్పారు. మండెలు వేసిన ఆకు కుళ్లిపోతుందనే భయాన్ని వ్యక్తం చేశారు. అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని, ఇంట్లో ఖర్చులు సైతం కొత్త అప్పులు చేస్తున్నట్లు వాపోయారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ పనులు చేసిన కూలీలకు డబ్బులిచ్చే పరిస్థితిలో కూడా రైతులు లేరని, బాండు ఉన్న రైతులు కంపెనీ కొనుగోలు కేంద్రం వద్దకు పంటను తీసుకెళ్లినా నాణ్యమైన ఆకునే రూ.10-13 వేలకు కొని మిగిలినదాన్ని వెనక్కు పంపుతున్నారని తెలిపారు. గతంలో రవాణా ఖర్చులుగా క్వింటాళ్కు రూ.200 ఇచ్చేవారని, ఇప్పుడు ఇవ్వడం లేదని తెలిపారు. గతేడాది గుల్లతో సహా రూ.15 వేలకు తగ్గకుండా కొన్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి రైతుల పంటనంతా కొనేలా చూడాలని డిమాండ్ చేశారు. అన్నదాత సుఖీభవ పధకంలో కౌలురైతులకు రూ.20 వేలు ఇస్తానన్న ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదని, కౌల్దార్లను కనీసం గుర్తించలేదని అన్నారు. ఇదిలా ఉండగా ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు ప్రతివారం డబ్బులివ్వడం లేదని, నిర్ణయించిన రూ.306 కూడా పడడం లేదని, సమ్మర్ అలవెన్సు ఇవ్వడం లేదని, ఎండలు తీవ్రంగా ఉన్న పని ప్రదేశాల్లో సరైన సదుపాయాలు లేవని చెప్పారు. వీటన్నింటి నేపథ్యంలో గ్రామాల్లో రైతులు, కౌలురైతులు, కూలీల పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా మారిందన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి.వెంకటేశ్వర్లు, రైతులు కె.నాగరాజు, ఎన్.ఇస్మాయిల్, కె.చక్రవర్తి, వి.చెంచయ్య, పి.కేశవరావు పాల్గొన్నారు.ప్రజాశక్తి-చిలకలూరిపేట : పొగాకు కొనుగోలు చేయకుండా రైతుల జీవితాలతో కంపెనీలు, ప్రభుత్వం ఆడుకుంటున్నాయని కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ అన్నారు. మండల పరిధిలోని మద్దిరాల, కమ్మవారిపాలెం, గోవిందపురం, కోమిటినేనివారిపాలెం, ఇర్లపాడు, గంగన్నపాలెం, కావూరు, లింగంగుంట్ల తదితర గ్రామాల్లో పొగాకు రైతులను సంఘం నాయకులు సోమవారం కలిసి మాట్లాడారు. పొగాకు కొనుగోళ్లు ఎక్కడా జరగడం లేదని, కొన్నిచోట్ల వ్యాపారు రూ.ఆరేడు వేలకు అడుగుతున్నారని రైతులు చెప్పారు. మండెలు వేసిన ఆకు కుళ్లిపోతుందనే భయాన్ని వ్యక్తం చేశారు. అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని, ఇంట్లో ఖర్చులు సైతం కొత్త అప్పులు చేస్తున్నట్లు వాపోయారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ పనులు చేసిన కూలీలకు డబ్బులిచ్చే పరిస్థితిలో కూడా రైతులు లేరని, బాండు ఉన్న రైతులు కంపెనీ కొనుగోలు కేంద్రం వద్దకు పంటను తీసుకెళ్లినా నాణ్యమైన ఆకునే రూ.10-13 వేలకు కొని మిగిలినదాన్ని వెనక్కు పంపుతున్నారని తెలిపారు. గతంలో రవాణా ఖర్చులుగా క్వింటాళ్కు రూ.200 ఇచ్చేవారని, ఇప్పుడు ఇవ్వడం లేదని తెలిపారు. గతేడాది గుల్లతో సహా రూ.15 వేలకు తగ్గకుండా కొన్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి రైతుల పంటనంతా కొనేలా చూడాలని డిమాండ్ చేశారు. అన్నదాత సుఖీభవ పధకంలో కౌలురైతులకు రూ.20 వేలు ఇస్తానన్న ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదని, కౌల్దార్లను కనీసం గుర్తించలేదని అన్నారు. ఇదిలా ఉండగా ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు ప్రతివారం డబ్బులివ్వడం లేదని, నిర్ణయించిన రూ.306 కూడా పడడం లేదని, సమ్మర్ అలవెన్సు ఇవ్వడం లేదని, ఎండలు తీవ్రంగా ఉన్న పని ప్రదేశాల్లో సరైన సదుపాయాలు లేవని చెప్పారు. వీటన్నింటి నేపథ్యంలో గ్రామాల్లో రైతులు, కౌలురైతులు, కూలీల పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా మారిందన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి.వెంకటేశ్వర్లు, రైతులు కె.నాగరాజు, ఎన్.ఇస్మాయిల్, కె.చక్రవర్తి, వి.చెంచయ్య, పి.కేశవరావు పాల్గొన్నారు.
