ప్రజాశక్తి-విజయనగరం కోట : సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని అధికారులను ఎస్పి వకుల్జిందాల్ ఆదేశించారు. సోమవారంజిల్లా పోలీసు కార్యాలయంలో వినతులు స్వీకరించారు. బాధితెల సమస్యలు విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదు దారులకు న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బి సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్కె చౌదరి, డిసిఆర్బి ఎస్ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
