ప్రజాశక్తి-శృంగవరపుకోట : మండలంలోని చామలాపల్లిలో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన తొత్తడి ప్రసాద్ అదే గ్రామానికి చెందిన నడుపూరి మురళి కత్తితో దాడి చేయడంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇరు కుటుంబాల మధ్య తగాదాలు ఉన్నాయి. మురళి భార్య తన కన్నవారింటి వద్ద ఉంటోంది. అందుకు కారణం ప్రసాద్ అని అనుమానించిన మురళి పలుమార్లు ఆతడిని చంపుతానని బెదిరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఒక శుభ కార్యానికి ట్రాక్టర్ డ్రైవర్ ప్రసాద్ ట్రాక్టర్పై సప్లయర్ సామాన్లు తీసుకొని వెళ్తుండగా గ్రామ శివారున మురళి కాపు కాసి ఉన్నాడు. సమీపంలోకి రాగానే కత్తితో నరికి చంపాడు. ఎస్ఐ నారాయణమూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
