కోమర్రులో కొండచిలువ కలకలం

May 7,2025 16:04 #in Komarru, #Python panic

ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : మండలంలోని కోమర్రులో బుధవారం కాసాని శ్రీనివాస్‌ ఇంటిలో కొండచిలువ కలకలం రేపింది. శ్రీనివాస్‌ ఇంటి ఆవరణలోని గోడను మరమ్మతుల కోసం పగలగొట్టగా గోడలో నుండి కొండచిలువ గుడ్లు పైన ఉండటాన్ని చూసి స్థానికులు ఆందోళన పడ్డారు కొండచిలువను గుర్తించి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. తమ ఇంటి గోడలో కొండచిలువ ఎప్పటి నుండి ఉన్నది తనకు తెలియదని చెప్పారు. కొండచిలువలు తమ గ్రామాల్లోకి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులంతా కోరారు.

➡️