ఈ నెల 20 న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
ప్రజాశక్తి- చీరాల : ఆశాలను కార్మికులుగా గుర్తించి వారికీ కనీసవేతనం రూ.26 వేలు ఇవ్వాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ ఆశాలుగా మార్పుచేసి పలు సమస్యల పరిష్కారం చూపాలని ఆశ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) అనుబంద జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వరమ్మ అన్నారు. ఈ నెల 20న చేపట్టనున్న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ గురువారం వైకుంఠపురం యుపి హెచ్ సి వైద్యాధికారి డాక్టర్ ప్రణరు కుమార్ కు, అదే విధంగా వేటపాలెం పి హెచ్ సి వైద్యాధికారి డాక్టర్ వైష్ణవి లకు ఆశా వర్కర్లు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒప్పంద జీఓలు విడుదలచేయాలని, నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్స్ సాధనకై కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు మే 20న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో ఆశా వర్కర్స్ అందరూ పాల్గనాలని అన్నారు. కార్మికులను యజమానులకు కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ రంగసంస్థలు పరిరక్షించాలని, ఆశాలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలన్నారు. ఒప్పంద జీఓలు విడుదలచేయాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు, సంక్షేమ పధకాలు అమలు చెయ్యాలని కోరుతున్నాము. గత 20 సంవత్సరాలుగా పేదప్రజలకు ఆరోగ్యసేవలు అందిస్తున్నారు. ప్రభుత్వం వారిని కార్మికులుగా గుర్తించి వారికి ఇతరసౌకరక్యాలను కల్పించాలని కోరుతున్నామని అన్నారు. విధినిర్వహణలో ప్రమాదవశాత్తు, అనారోగ్యంతో ఆశావర్కర్లు అర్ధాంతరంగా చనిపోతున్నారని, ప్రభుత్వం ఆశావర్కర్స్ కు గ్రూప్షన్సూరెన్సు సౌకర్యం కల్పించాలన్నారు. ఏజెన్సీలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ను ఆశాలుగా మార్పు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు కె కరిమున్, ఏం తులసి లక్ష్మి కే శివ పార్వతి, ఎస్ కిరణ్ కుమారి,పి పద్మావతి, రాణి శారద, నాగలక్ష్మి, హైమా, మాణిక్యం శ్రీదేవి, చిన్ని,రజిని, కస్తూరి, అనురాధ పలువురు పాల్గొన్నారు.
