తిరువట్యం సుబ్రమణ్యం భౌతికకాయానికి ఎమ్మెల్యే ఆదిమూలం నివాళి

ప్రజాశక్తి- పిచ్చాటూరు (తిరుపతి) : నారాయణవనం మండలం తిరువట్యం గ్రామానికి చెందిన గ్రామ పెద్ద సుబ్రమణ్యం మరణించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరువట్యం గ్రామానికి చేరుకుని సుబ్రమణ్యం భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫైనాన్స్‌ కమిటీ సభ్యులు కోనేటి సుమన్‌ కుమార్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️