ప్రజాశక్తి- తిరుపతి(మంగళం) : తిరుపతి జిల్లా మంగళం పరిధిలోని తిరుమలనగర్ గ్రామపంచాయతీలో నిర్మాణంలో ఉన్న భవనం ఐదో అంతస్తు నుంచి పడి ముగ్గురు భవన నిర్మాణ కార్మికులు దుర్మరణం చెందారు. తుడా క్వార్టర్స్లోని హెచ్ఐజి ఫ్లాట్ నెంబర్ 63లో ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ భవనాన్ని రిటైర్డ్ టీచర్ కడివేటి అండాలయ్య నిర్మిస్తున్నారు. భవన నిర్మాణం కోసం తిరుపతి పట్టణాభివద్ధి సంస్థ నుండి జి ప్లస్ 3 అనుమతి తీసుకొని జి ప్లస్ 5 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఐదో అంతస్తులో పడమటి వైపు పూతపని చేయడానికి నలుగురు మేస్త్రీలు సిమెంటు కలవతో పైకి వెళ్లారు. వీరు పైకి వెళ్లడానికి వీలుగా కర్రలతో ఏర్పాటు చేసుకున్న ‘సారవ’ నుంచి ఓ కర్ర జారిపోవడంతో పైనుంచి ఒక్కసారిగా కింద పడిపోయి తిరుపతికి చెందిన బోటతొట్టి శ్రీనివాసులు (38), ఒంగోలు జిల్లా ఆకర్లపూడి గ్రామానికి చెందిన బావమరుదులు తన్నీరు వసంత్ (40), కె.శ్రీనివాసులు (38) అక్కడికక్కడే మృతి చెందారు.
ఐదో అంతస్తు నుంచి పడి ముగ్గురు భవన నిర్మాణ కార్మికుల దుర్మరణం
