అపోలో హాస్పిటల్ అరగొండ ఆరోగ్య రంగంలో మరో మైలురాయిప్రజాశక్తి – తవణంపల్లి: డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి నేతత్వంలో గ్రామీణ ఆరోగ్య సేవలలో కొత్త అధ్యాయం మొదలయ్యింది. అత్యాధునిక యూరో లేజర్ సాంకేతికతను ఈ రోజు పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే కలికిరి మురళీ మోహన్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు.” ఈ యంత్రం ద్వారా కిడ్నీ రాళ్లు, మూత్ర సంబంధిత వ్యాధులకు మరింత ఖచ్చితమైన, తక్కువ భాదతో చికిత్స అందుబాటులోకి వచ్చింది.” ఈ కార్యక్రమంలో ప్రముఖ యూరోలజీ నిపుణుడు డాక్టర్ హెచ్.ఎస్. శంకర్ సాంకేతికతపై వివరాలు అందించారు. వారి నైపుణ్యంతో, ఈ లేజర్ చికిత్స ఇప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించనుంది.” అపోలో అరగొండ యూరో లేజర్ ప్రాణాలను తక్కువ సమయంలో కాపాడే శక్తి, నూతన ఆశకు నాంది!’ అన్నారు. ఈ ఆపరేషన్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ కార్డు ద్వారా చేసుకునే అవకాశం ఉన్నదని డాక్టర్ వినోద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి, కంరుద్దీన్ అపోలో హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు.
