తిరుపతిలో షాడో వ్యవహారాలు మానుకోవాలి : సిపిఎంప్రజాశక్తి -తిరుపతి టౌన్తిరుపతి నగరంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆయన బదులు తన కుమారులను పంపి సమీక్షలు నిర్వహించటం, ఉన్నత స్థాయి అధికారులతో కూర్చుని మాట్లాడటం ఐఏఎస్ లతో సహా అధికారులు ‘జీ… హుజూర్’ అంటూ సమావేశాలలో పాల్గొనటం మానుకోవాలని సిపిఎం నేత కందారపు మురళి సూచించారు. తిరుపతి అభివద్ధి పై ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సమీక్ష చేసి ఉంటే బాగుండేదని, కాకపోతే ఆయన అన్న కుమారుడు శివకుమార్ సమీక్షించడం మంచి పద్ధతి కాదన్నారు. ఇలాంటి సాంప్రదాయాలు తిరుపతిలో కొనసాగించవద్దని సూచించారు.