అన్నప్రసాదం, పారిశుధ్యానికి పెద్దపీటశ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఈవో సమీక్షప్రజాశక్తి -తిరుమలతిరుమలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీవారి వార్షిక బ్రహ్మౌత్సవాలకు వారం కంటే తక్కువ సమయం ఉన్నందున, తొమ్మిది రోజుల పాటు ఉత్సవాల ఏర్పాట్లను, టీటీడీలోని అన్ని విభాగాలపై టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి సమీక్షించారు. తిరుమల అన్నమయ్య భవనంలో వార్షిక బ్రహ్మౌత్సవాల తుది సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అన్ని శాఖల ఏర్పాట్లలో ఎలాంటి రాజీ ఉండకూడదని, అన్నప్రసాదం, ఆరోగ్య విభాగాలు రెండు ముఖ్యమైన విభాగాలుగా ఒకదానికొకటి సమన్వయం చేసుకుని దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ”అన్నప్రసాదం వడ్డించడం పూర్తయిన వెంటనే, చెత్తను తొలగించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ఆలస్యం చేయకుండా ఆరోగ్య శాఖ పారిశుధ్య కార్మికులను ఆదేశించాలని సూచించారు. అనంతరం ఇంజినీరింగ్ పనులు, శ్రీవారి ఆలయం, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, గార్డెన్, ఫారెస్ట్లు, నత్యం, భజన బందాలు, రవాణా, గోశాల, మెడికల్ విభాగాలను ఈవో పరిశీలించారు. శ్రీవారి సేవకుల సేవలను ఆయా విభాగాలు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిఎల్వో వరప్రసాద్, సిఈ సత్యనారాయణ, ఎఫ్ఎసిఎఓ బాలాజీ పాల్గొన్నారు.
అన్నప్రసాదం, పారిశుధ్యానికి పెద్దపీటశ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఈవో సమీక్ష
