రేణిగుంట విమానాశ్రయంలో… ‘మాక్‌డ్రిల్‌’

ప్రజాశక్తి -తిరుపతి సిటీ ఎయిర్‌ పోర్ట్‌లో ఏదైనా అనుకోని ఘటనలు జరిగే సమయంలో ఎయిర్‌ పోర్ట్‌ లో ప్రజలను ఎలా కాపాడుకొవాలో అనే దానిపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు ఆదేశాల మేరకు ఎయిర్పోర్టు డైరెక్టర్‌ భూమి నాదన్‌, ఏ ఎస్‌ పి రవి మనోహర చారి పర్యవేక్షణలో పోలీసులు మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. పాత విమానాశ్రయములో శనివారం 120 మంది సిబ్బందితో కలిసి అనుకోకుండా ఎయిర్‌ పోర్ట్‌ లో టెర్రరిస్టు వస్తే వారిని ఎలా ఎదుర్కోవాలో అనేదానిపై పోలీసులు మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఇద్దరు టెర్రరిస్టులు ఎయిర్‌ పోర్ట్‌ లోకి ప్రవేశించి విచ్చలవిడిగా కాల్పులు జరిపితే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు మాక్‌ డ్రిల్‌ లో సిబ్బంది చూపించారు. ఒక్కరిగా ఎయిర్‌ పోర్ట్‌ లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. అయితే ఎం జరుగుతుందో అర్ధకాని పరిస్థితిలో పబ్లిక్‌, ఎవరు వచ్చారో గందరగోళం పరిస్థితి లో ఎయిర్‌ పోర్ట్‌ సిబ్బంది ఉన్నారు. వెంటనే ఎయిర్‌ పోర్ట్‌ లో సిఆర్పీఎఫ్‌ బలగాలు, సిసి కెమెరాలు ద్వారా ఎంత మంది టెర్రరిస్టులు వచ్చారు, అనేదాని పై అవగాహనకు వచ్చిన తరువాత ఆపరేషన్‌ మొదలు పెట్టారు. టెర్రరిస్టులను సీఆర్పీఎఫ్‌ బలగాలు ప్రణాళిక బద్దంగా అంతం చేసిన విధానాన్ని ఎయిర్‌ పోర్ట్‌ లో ప్రజలకు కళ్ళకు కట్టినట్లు అధికారులు చూపించారు. ఒకవేళ టెర్రరిస్టులు ఎయిర్‌ పోర్ట్‌ లోకి ప్రవేశిస్తే.. అంతం చేస్తామని దీటుగా సీఆర్పీఎఫ్‌ బలగాలు మాక్‌ డ్రిల్‌ చేసి చూపించారు. ప్రజల రక్షణ కోసం సీఆర్పీఎఫ్‌ బలగాలకు మేము తోడుగా అంటూ పోలీస్‌ సిబ్బంది తోపాటు బాంబు స్వ్కాడ్‌, డాగ్‌ స్వ్కాడ్‌ తో ఎయిర్‌ పోర్ట్‌ అంతా జల్లిడ పట్టారు. అనుమానిత బ్యాగులను పూర్తి స్ధాయిలో తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే… వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్‌.పిలు శిరీష, కే.బహదూర్‌, రవీంద్రనాథ్‌ రెడ్డి, చంద్రశేఖర్‌, సిఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ రాజేంద్రప్రసాద్‌, సిఎస్‌ఓ శ్రీనివాసరావు, సీఐలు శ్రీకాంత్‌ రెడ్డి, మంజునాథ్‌ రెడ్డి, ఎస్‌ ఐ బాబా పాల్గొన్నారు.ఎస్పీలతో డిజిపి వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్ర డిజిపి హరీష్‌ కుమార్‌ గుప్తా దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఎస్పిలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తిరుపతి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఉండి జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు, జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పరిస్థితులను డీజీపీకి వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతల విషయంతో పాటు వివిధ పరిణామాలపై డిజిపి హరిష్‌ కుమార్‌ గుప్తా ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఏఎస్పీలు జె. వెంకట్రావు, శ్రీనివాసరావు, సిఐలు సాదిక్‌ ఆలీ, సుబ్రహ్మణ్యం, ఆర్‌ ఐలు రాజశేఖర్‌ రెడ్డి, రమణారెడ్డి, రమేష్‌ పాల్గొన్నారు.జిల్లాలో డ్రోన్‌ కెమెరాలఫై ఆంక్షలుజిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్‌ రాజు ఆదేశాలతో తిరుపతి జిల్లా భద్రతా పరంగా సున్నితమైన ప్రాంతం కావడంతో జిల్లా వ్యాప్తంగా డ్రోన్‌ కెమెరాల అనధికార వినియోగంపై పోలీసులు అంక్షలు విధించారు. తిరుపతి దేశంలో ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. దేశ నలుమూలల నుండి దర్శనార్థం వచ్చే భక్తులు, తిరుమల శ్రీవారి దేవస్థానం, విమానాశ్రయం తో భద్రతా దష్ట్యా సున్నితమైన ప్రాంతంగా గుర్తించారు. తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో డిజిసిఏ విధించిన నిబంధనలు ఉల్లంఘిస్తూ అనధికారికంగా డ్రోన్‌ వినియోగం జరుగుతోంది. ఇది ప్రజల శాంతి భద్రతలకు ప్రమాదకరంగా పోలీసులు గుర్తించారు. ఎస్పీ ఆదేశాలతో డ్రోన్లకు ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ జిల్లాలో డ్రోన్‌ కెమెరాలను ఎగురవేయాలంటే తప్పనిసరిగా డిజిసిఎ నుంచి లైసెన్స్‌లు పొందాలని సూచించారు. నిర్దిష్ట జోన్లలో డ్రోన్లుఎగరకూడదని సూచించారు.

➡️