రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిప్రజాశక్తి -దొరవారిసత్రం : మండల పరిధిలోని నెలబల్లి గ్రామ సమీపాన ఉన్న జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నెలబల్లి గ్రామానికి చెందిన, పున్నేపల్లి పోలయ్య(50) అను అతను మృతి చెందాడు, పోలయ్య నెలబల్లి లోని హరిజనవాడకు బైక్ పై వెళ్లి తిరిగి తన ఇంటికి వస్తూ ఉండగా జాతీయ రహదారి సర్కిల్ ను దాటుతున సమయంలో చెన్నై నుండి హైదరాబాదుకు వెళుతున్న కారు మోటార్ బైక్ ను ఢకొీన్నది దీంతో బైకుపై ఉన్న పోలయ్య అక్కడకక్కడే మతిచెందాడు ఈ విషయం తెలుసుకున్న దొరవారిసత్రం ఎస్సై అజరు కుమార్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు అనంతరం బైకును ఢకొీన్న కారుని ఎస్సై అదుపులోకి తీసుకున్నారు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి బుధవారం పోస్టుమార్టం నిర్వహించి మతదేహాన్ని తన బంధువులకు అప్పగించారు మతుడికి భార్య పిల్లలు ఉన్నారు, పోలయ్య మతి చెందడంతో భార్య పిల్లలు గ్రామస్తులు బంధువులు కన్నీరు మున్నీరుగా ఏడవసాగారు.ఈ కేసును ఎస్సై అజరు కుమార్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు
