ప్రజాశక్తి- తిరుపతి టౌన్: తిరుపతి నగరంలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో జరగనున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వి నాగరాజు మాట్లాడుతూ ఈ సమావేశాలకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు హాజరవుతారని, కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ మహాసభలో పలు నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. దేశంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. పేదల అభ్యున్నతికి మోడీ ప్రభుత్వం పాటుపడడంలేదని కార్పొరేట్ వ్యక్తులకు మాత్రమే లాభాలు తెచ్చి పెట్టేలా పనిచేస్తోందని వెల్లడించారు. అన్ని రంగాల్లో మోడీ ప్రభుత్వం విఫలమైందని గుర్తు చేశారు. ముఖ్యంగా ఉద్యోగ కార్మిక వర్గాన్కి తీరని అన్యాయం జరుగుతోందన్నారు. భారత్ పాకిస్తాన్ ఉద్రికత్తల నేపథ్యంలో శాంతియుతంగా సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని కోరారు. ర్యాలీలో సిపిఎం జిల్లా నాయకులు ఎస్ జయచంద్ర, నగర కార్యదర్శి వేణు, పి సాయిలక్ష్మి, బుజ్జమ్మ, మల్లికార్జున, రాధాకృష్ణ, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జయప్రదం చేయాలని కోరుతూ స్కూటర్ ర్యాలీ
