ప్రజాశక్తి – తిరుపతి టౌన్ తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు శనివారం టిటిడి తరపున ఛైర్మన్ బిఆర్నాయుడు, ఈవో జె.శ్యామలరావు సారె సమర్పించారు. ముందుగా సారెకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని శ్రీ పుండరీకవల్లి అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కళాబందాల ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా సారెను తీసుకెళ్లారు. అంతకుముందు శేషవస్త్రాలు, పసుపు కుంకుమ తదితర మంగళద్రవ్యాలతో కూడిన సారెను తిరుపతి ఎమ్మెల్యే ఎ. శ్రీనివాసులుకు అందజేశారు. బిఆర్ నాయుడు మాట్లాడుతూ గంగమ్మతల్లి సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామి సోదరి అని, భక్తుల కోరికలు తీర్చే దైవంగా అమ్మవారు పూజలందుకుంటున్నారని తెలిపారు. టిటిడి నిధులతో తాతయ్య గుంట గంగమ్మ ఆలయం అభివద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, ఇదే సహకారాన్ని భవిష్యత్తులో అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు జి. భాను ప్రకాష్ రెడ్డి, శాంతా రామ్, డిప్యూటీ ఈవోలు వి.ఆర్.శాంతి, లోకనాధం, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ, ఏవీఎస్వో సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఐదో రోజు గంగమ్మను ‘దొర’వేషంలో భక్తులు దర్శించుకున్నారు. ఎంఎల్ఎ ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ ఎన్.మౌర్య ఆధ్వర్యంలో భక్తులకు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ, తాగునీటిని పంపిణీ చేశారు. జాతర, విశ్వరూప దర్శనం రోజు భక్తులు ఎక్కువ సంఖ్యలో రానుండడంతో గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మంగళవారం జాతర రోజు, విశ్వరూప దర్శనం రోజు ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఎంతమంది స్టేజ్ పైన ఉండాలి, తదితర విషయాలపై ఉత్సవ కమిటీ, ఆలయ అధికారులు, పోలీసు అధికారులతో చర్చించామని అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికష్ణ, డీఎస్పీ భక్తవత్సలం, సూపరింటెండెంట్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, ఆర్. ఓ. సేతుమాధవ్, ఆలయ ఈవో జయకుమార్ ఉన్నారు.
