విలియం షేక్స్పియర్‌ జయంతి

విలియం షేక్స్పియర్‌ జయంతి

విలియం షేక్స్పియర్‌ జయంతి ప్రజాశక్తి -గుడిపల్లి: ద్రావిడ విశ్వవిద్యాలయం, ఆంగ్ల శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత విలియం షేక్స్పియర్‌ 461 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్‌ పద్య పోటీలలో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో మొదటి విజేతగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, క్రిష్ణగిరి వారు, రెండవ విజేతగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల,పాకాల మరియు తృతీయ బహుమతి ద్రావిడ విశ్వవిద్యాల పరిశోధక విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎం దొరస్వామి మాట్లాడుతూ విలియం షేక్స్పియర్‌ నాటకాలు ఈనాటికి కొత్తదనంతో సమకాలీన అంశాలతో దగ్గరగా ఉంటూ అలరిస్తున్నాయన్నారు. రిజిస్ట్రార్‌ ఆచార్య వి కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ విలియం షేక్స్పియర్‌ జన్మదిన వేడుకల్ని విశ్వవిద్యాలయం జరుపుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తపరిచారు. డీన్‌ అకడమిక్‌ అఫైర్స్‌ ఆచార్య కే. శ్యామల మాట్లాడుతూ ఇలాంటి పోటీలు జ్ఞాన సమపార్చనకు, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతాయి అన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఆంగ్ల శాఖ అధ్యక్షులు ఆచార్య సిహెచ్‌ రాజేంద్రప్రసాద్‌ మరియు ప్రిన్సిపాల్‌ వి. మంజుల ప్రభుత్వ ఫస్ట్‌ గ్రేడ్‌ కళాశాల, బంగారు తిరుపతి, కోలార్‌ మధ్య విద్యార్థులకు సంబంధించిన %వీఉఖ% పైన సంతకం చేయడం జరిగింది, ఈ ఒప్పందం వలన కర్ణాటక రాష్ట్రమునకు మరియు ద్రావిడ విశ్వవిద్యాలయమునకు విద్యార్థుల ప్రవేశాల మెరుగు పడటానికి అవకాశం ఎక్కువగా ఉన్నదని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

➡️