ప్రజాశక్తి-నాగులుప్పలపాడు: నల్లబర్లీ పొగాకు సాగు చేసిన రైతులు రోడ్డుపై చెక్కుల ను దగ్ధం చేసి నిరసన తెలిపారు. మండలంలోని కండ్ల గుంట పొగాకు రైతులు మంగళవారం నాగులుప్పలపాడు లోని ఇంకొల్లు రోడ్డువద్ద పొగాకు చెక్కులను దగ్దం చేశారు. ఈ సందర్భంగా పొగాకు రైతులు మాట్లాడుతూ ప్రయివేట్ కంపెనీలు నల్లబర్లీ పొగాకు సాగు చేయించి తీరా పంట మొత్తం చేతికి వచ్చిన తరువాత మోసం చేశాయన్నారు. పలుమార్లు రైతుసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టగా మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసినా నేటికీ కొనుగోలు ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటను నిల్వ చేసేందుకు వసతులు లేక ఆందోళనకు దిగినట్లు తెలిపారు. పాలపర్తి సతీష్ 12 ఎకరాలు కౌలు తీసుకొని ఏకరానికి 1.50 లక్షలు పెట్టుబడి పెట్టి సాగుచేసినట్లు తెలిపారు. కూలీలకు డబ్బలు ఇవ్వలేని స్థితిలో దగ్ధం చేశామన్నారు. ఇప్పటికైనా ప్రభత్వం స్పందించి కంపెనీల చేత నల్లబర్లీ పొగాకును కొనుగోలు చేయించి ఆదుకోవాలని కోరారు.
