నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

Jun 23,2024 18:33
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

కమిషర్‌ వికాస్‌ మర్మత్‌
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రజాశక్తి – నెల్లూరు సిటీప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం పొందాలని నగర కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌ ఆకాంక్షించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ మీటింగ్‌ హాలులో ఉదయం 10.00 గంటలకు జరిగే కార్యక్రమంలో ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం కార్యాలయంలో కమిషనర్‌ను నేరుగా కలిసి సమస్యలను ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. తెలుసుకున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

➡️